న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రపంచంలోని ‘ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటన’కు బయల్దేరిన ఓ బ్రిటన్ విద్యార్థి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయాడు. అతని పేరు మైల్స్ రౌట్లెడ్జ్(21). తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకోకముందు మైల్స్ తన పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లాడు. తీరా తిరిగి వచ్చే సమయానికి ఆ దేశం తాలిబన్ల వశమైంది. అతని పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. ప్రస్తుతం అతడు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఓ భద్రతా గృహంలో తలదాచుకొంటున్నాడు.