ఇస్లామాబాద్: ఇటీవల పెండ్లి చేసుకునే వధువరులు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. తమ వివాహం గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు చెందిన ఒక జంట ఏకంగా అందంగా అలంకరించిన జేసీబీలో ప్రయాణించి వివాహ వేదికకు చేరుకున్నది. దారి పొడవునా స్థానికులు వారికి చీర్స్ చెప్పారు. పెండ్లి వేదిక వద్ద జేసీబీ నుంచి కిందకు దిగిన వధువరులకు వారి బంధువులు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి సందడి చేశారు.
పాకిస్థాన్లోని హంజా లోయలో జరిగిన ఈ పెండ్లికి సంబంధించిన వీడియోను ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ గులాం అబ్బాస్ తన ట్విట్టర్ ఖాతాలో పొస్ట్ చేశారు. పాక్లోని హంజా వ్యాలీలో అడ్వెంచర్స్ వెడ్డింగ్ అని దీనికి శీర్షిక పెట్టారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు దీనిపై విభిన్నంగా కామెంట్లు చేశారు.