కంటోన్మెంట్, ఏప్రిల్ 17: సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం బోయిన్పల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధిత కు టుంబ సభ్యుడు శంకర్కు మాజీ బోర్డు సభ్యుడు పాండుయాదవ్తో కలిసి అందజేశారు. బోయిన్పల్లి తవాయ్పురాకు చెందిన భారతి వైద్య చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా రూ. 60 వేలు మంజూరయ్యాయి. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంలా ఆదుకుం టుం దన్నారు. చికిత్స చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆసరాగా ఉంటుందని తెలిపారు.