టీఆర్ఎస్కు ఓటెయ్యండి..
మంత్రి అజయ్ కుమార్
ఖమ్మం, ఏప్రిల్ 22: ఖమ్మం నగరాన్ని హైదరాబాద్తో సమాంతరంగా అభివృద్ధి చేసిన పార్టీకి ఓట్లు వేయాలో, అభివృద్ధికి అడ్డుపడే శక్తులకు ఓట్లు వేయాలో నగర ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. కేఎంసీ ఎన్నికల్లో భాగంగా 46, 47, 48 డివిజన్లలో గురువారం ఉదయం ఆయన ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఆయా డివిజన్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కన్నం వైష్ణవి, మాటేటి అరుణ, తోట గోవిందమ్మను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్ టాప్ వాహనంలో అభ్యర్థులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ముందుగా 48వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకుడు తోట వీరభద్రం ఇంటివద్ద వేలాది మంది కార్యకర్తలు కోలాటం, డప్పు నృత్యాలతో మంత్రికి స్వాగతం పలికారు. గోవిందమ్మకు భారీ మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. తరువాత 46వ డివిజన్ జూబ్లీక్లబ్ ప్రాంతంలో టీఆర్ఎస్ డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం సారథినగర్, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి కన్నం వైష్ణవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం 47వ డివిజన్ బొక్కలగడ్డలో టీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా వనమా రాఘవతో కలిసి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంచికంటి నగర్, వెంకటేశ్వరనగర్, కనకదుర్గమ్మ గుడిసెంటర్లో రోడ్షో నిర్వహించారు.
ప్రగతికి పట్టం కట్టండి..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46, 47, 48 డివిజన్ల నుంచి వెళ్లే గోళ్లపాడు చానల్ మురుగు కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఎన్నేళ్లుగా ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఇబ్బందులను తొలగించినట్లు గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని కోరారు. నగరంలో అవ్వలందరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, అర్హులైన పేదలకు టేకులపల్లిలో 1250 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని గుర్తుచేశారు. గోళ్లపాడు కాలువపై త్వరలోనే పార్కులు, ఓపెన్ జిమ్లు నిర్మిస్తామన్నారు. గోళ్లపాడు బాధితులకు వెలుగుమట్ల వద్ద విలువైన స్థలాలను ఇచ్చామన్నారు. నగరంలో పలు రోడ్లను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, నూతన బస్టాండ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయని, ఐటీ హబ్ ద్వారా ఖమ్మం యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు కన్నం ప్రసన్నకృష్ణ, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, వంగాల వెంకట్, చేతి కృష్ణ, మాటేటి రామారావు, మాటేటి కిరణ్కుమార్, చిన్న మల్లేశం, విజయ్, ఎస్కే.జానిమియా, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో యథావిధిగా మున్సిపల్ ఎన్నికలు
రియల్ మీ సంచలనం..తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్