కొల్లాపూర్, మార్చి 23: పట్టణ శివారులోని ఈదమ్మ ఉత్సవాలు ముగింపు సందర్భంగా జాతర ప్రాంగణంలో రెండు రోజులపాటు జరిగే అంతర్రాష్ట్ర న్యూకేటగిరి విభాగంలో వృషభరాజముల బలప్రదర్శన బండలాగుడు పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పో టీలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తల్లిదండ్రులు బీరం లక్ష్మారెడ్డి, బిచ్చమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలకు ఎడ్లను తీసుకొచ్చిన పలువురు రైతులకు ఎమ్మెల్యే బీరం తల్లిదండ్రులు శాలువా కప్పి సన్మానించారు. ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూల్ జిల్లాతోపాటు మహబూబ్నగర్ ఉమ్మ డి జిల్లా నుంచి మొత్తం 11 జతల వృషభ రాజములు బం డలాగుడు పోటీలకు వచ్చాయి. ఈ బలప్రదర్శనను వీక్షించేందుకు పలు గ్రామాల నుంచి రైతులు భారీగా తరలొచ్చారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసు కోకుండా ఎస్సై మురళీగౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎంపీపీ సభావట్ భోజ్యనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ విజయక్ష్మి, వైస్ చైర్పర్సన్ మహిమూదాబేగం, సింగిల్విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, దవాఖాన చైర్మన్ కాటం జంబులయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎండీ జాఫర్, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మున్సిపల్ కోఆప్షన్సభ్యులు వెంకటస్వామి, రుక్మద్దీన్, కౌన్సిలర్లు హైమావతిగౌడ్, అనితయాదవ్, బరిగెల రాముడుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంచందర్యాదవ్, నాయకులు గాలియాదవ్, కరీమొద్దీన్, ఖాదర్పాషా, చింతకుంట రాఘవేందర్, వేణు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.