ముప్పై ఏండ్లలో హై-బీపీ రోగులు రెట్టింపు
లండన్, ఆగస్టు 25: ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటుతో (హైపర్టెన్షన్) బాధపడుతున్న రోగుల సంఖ్య గడిచిన ముప్పై ఏండ్లలో రెట్టింపైనట్టు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. పేద, మధ్య తరగతి దేశాల్లోనే ఈ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. 184 దేశాల్లోని 30-79 వయసు గల 10 కోట్ల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
తమకు రక్తపోటు సమస్య ఉన్నదన్న విషయం తెలియనివారు 64 కోట్లు
హైపర్టెన్షన్తో ఏటా మరణిస్తున్నవారు 85 కోట్లు
చికిత్స చేయలేని స్థితికి చేరుకున్న హైపర్టెన్షన్ రోగులు
మహిళలు 32 కోట్లు
పురుషులు 44 కోట్లు