మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : యువత మహనీయుల అడుగుజాడల్లో నడువాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో ఆదివారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల నిర్మూలన, సమ సమాజ పునర్నిర్మాణం కోసం పునాదులు వేసిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, సంపంగి రవి, గండ్రత్ రమణ, నాయకులు అడ్ప పోశెట్టి, శ్రీధర్ తదితరులున్నారు.
గురుకుల విద్యార్థికి అభినందన..
భారత వాయుసేన అధికారిగా ఎంపికై చరిత్ర సృష్టించిన తొలి గురుకుల విద్యార్థిని చాముండేశ్వరి దేవిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన గోపు విజయ్ కుమార్-శారద కూతురు విద్యార్థిని చాముండేశ్వరితో ఆయన ఫోన్లో మాట్లాడారు. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, దేశానికి, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉత్తమ ర్యాంకు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వన్నె తెచ్చావని కొనియాడారు.
కలెక్టరేట్లో..
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 11: పట్టణంలోని కలెక్టరేట్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్తో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల నిర్మూలన, సమ సమాజ పునర్నిర్మాణం కోసం మొట్టమొదట పునాదులు వేసిన మహానీయుడు ఫూలే అని కొనియాడారు. ఫూలే ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్యా ప్రమాణాలు పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేశ్, డీఎస్వో కిరణ్కుమార్, వెనుకబడిన తరగతుల సహా య సంక్షేమాధికారి రాజేశ్వర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జానారెడ్డి.. ప్రజలకు గుర్తుండే పని ఒక్కటైనా చేశావా?
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి