లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిర్ణయం
తెల్ల రేషన్ కార్డుదారులందరికీ వర్తింపు
ఉమ్మడి జిల్లాలో 28 లక్షల మందికిపైనే ప్రయోజనం
కరీంనగర్, మే 31(నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు, పేదలపై మరోసారి కరుణ చూపింది. గతంలో మాదిరిగా తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఈ నెల నుంచే ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికీ 15 కిలోలు ఇవ్వనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,33,979 మంది లబ్ధిదారులకు ప్రయోజనం దక్కనున్నది.
లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సర్కారు చేయూత నిస్తున్నది. విపత్కర పరిస్థితిలో ఓ వైపు సంక్షోభా న్ని అధిగమిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా ఉచిత బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఒక్కరికీ 15 కిలోల చొప్పున మంగళవారం నుంచి పంపిణీకి శ్రీకారం చుడుతుండ గా, పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆపత్కాలంలో అండగా..
పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కారు ఆపత్కాలంలోనూ అండగా నిలుస్తున్నది. గతేడాది జూలై నుంచి నవంబర్ దాకా ఉచితంగా బియ్యం పంపి ణీ చేసింది. ఈ సంవత్సరం సైతం కరోనా విలయ తాండవం చేస్తుండడంతో లాక్డౌన్ విధించక తప్పలేదు. దీంతో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం మళ్లీ ఉచిత బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో 10కిలోల చొప్పున అందించగా, ఈ సారి 15కిలోల చొప్పు న ఇవ్వనుంది. ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుడికి నేటి నుంచి ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రేషన్ దుకాణాలకు చేరిన బియ్యం
ప్రతి నెలా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని వారం రోజుల ముందే డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అదే మాదిరిగా జూన్ నుంచి పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నది. అయితే, మార్గదర్శకాలు రావడం ఆలస్యం కావడంతో ఉచిత బియ్యంపై డీలర్లకు ఆదేశాలు ఇవ్వలేదు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పక్కా ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆహారభద్రత కార్డు దారుల్లో ఒక్కొక్కరికీ 15కిలోల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అంత్యోదయ, అన్నయోజన, అన్నపూర్ణ కార్డు దారులకు ప్రస్తుతం ఇచ్చే బియ్యానికి తోడు ఒక్కో కార్డుకు అదనంగా మరో 10 కిలోల బియ్యాన్ని ఇవ్వనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
జిల్లాలోని 13 మండలాల్లో తెల్లరేషన్ కార్డులు లక్షా 73వేల 65 ఉండగా, 5లక్షల 5వేల 476 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 344 దుకాణాల్లో ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
జిల్లాలోని 13 మండలాల్లో 2,15,914 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 2,03,424 ఆహార భద్రతా కార్డులు, 12,313 అంత్యోదయ, 177 అన్నపూర్ణ కార్డులు ఉండగా, మొత్తం 6,29, 381 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 413 చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.
కరీంనగర్ జిల్లాల్లో..
జిల్లాలో ప్రస్తుతం 2,73,552 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో 8,11,559 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి జిల్లాలోని 487 దుకాణాల్లో జూన్ నెలలో ప్రతి ఒక్కరికీ 15కిలోల చొప్పున 1,21,733.85 క్వింటాళ్ల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నాను.
జగిత్యాల జిల్లాలో..
జిల్లాలో ప్రస్తుతం 3,03,081 తెల్లరేషన్కార్డు లు ఉన్నాయి. ఇందులో 2,88,531 ఆహారభద్ర త, అంత్యోదయ14,404, అన్నపూర్ణ 157 కార్డు లు ఉండగా, మొత్తం లబ్ధిదారులు 8,87,563 మంది ఉన్నారు. వీరికి జూన్లో 587 రేషన్ షాపు ల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
జిల్లాలోని 2,15,914రేషన్ కార్డులు ఉన్నారు. అందులో ఒక్కొక్కరికీ ఉచితంగా 15కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. జిల్లాలోని 413 చౌకధరల దుకాణాల ద్వారా నేటి నుంచి బియ్యం పంపిణీ చేస్తాం. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బియ్యాన్ని స్వీకరించాలి. లాక్డౌన్ నిబంధనలకు లోబడి సడలింపు సమయంలోనే బియ్యం పంపిణీ చేస్తాం.
నేటి నుంచే ఇస్తున్నాం..
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం నేటి నుంచి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి నెలా బియ్యం సరఫరా చేస్తున్నట్లే ఈనెల కూడా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని చేర్చడం జరిగింది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు సోమవారం అందాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 15కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తాం.