ఆస్ట్రేలియా జూలో సందర్శకుల సంభ్రమాశ్చర్యం
సిడ్నీ, సెప్టెంబర్ 4: అది ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలోని టరోంగా జూ. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో పర్యాటకులు జూకి పోటెత్తారు. ఉన్నట్టుండి పిల్లాడి ఏడుపు. గుక్క పెట్టకుండా ఏడుస్తున్న ఆ చిన్నారి ఎక్కడ? అంటూ సందర్శకులు తెగ వెదుకుతున్నారు. చివరకు ఆ ఏడుపు పిల్లాడిది కాదని, ఓ పక్షిదని తెలుసుకొని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ పక్షే ‘లైర్బర్డ్’. ఈ పక్షి గొంతులో నాలుగు జతల కండరాలకు బదులు మూడు జతల కండరాలు ఉంటాయి. దీంతో పర్యవరణంలోని అన్ని శబ్దాలను, మనుషుల గొంతులను ఈ పక్షి అనుకరించగలదని జూ ప్రతినిధులు తెలిపారు. లాక్డౌన్ కాలంలో పలు శబ్దాల్లో ఈ పక్షికి శిక్షణనిచ్చినట్టు చెప్పారు.