వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలుసు కదా. క్వాడ్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభల్లో పాల్గొనడానికి వెళ్లిన మోదీ.. తొలి రోజు చాలా బిజీగా గడిపారు. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్తోపాటు అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో వరుసగా భేటీ అయ్యారు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన మోదీ.. శుక్రవారం ఆయనను కలవనున్నారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన హోటల్ ( Billard Hotel ) ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ హోటల్ విశేషాలేంటో ఓసారి చూద్దాం.