వాషింగ్టన్, జూన్ 3: అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్కార్డుల జారీకి కీలక ముందడుగు పడింది. గ్రీన్కార్డుల జారీలో ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న 7 శాతం కోటాను (కంట్రీ క్యాప్ను) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు బుధవారం ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్కార్డుల జారీలో సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ‘2021 ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) యాక్ట్, 2021’ పేరిట ఈ బిల్లును కాంగ్రెస్ మహిళా సభ్యురాలు జో లోఫ్గ్రెన్, మరో కాంగ్రెస్ నేత జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు. అలాగే, కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న ప్రస్తుత 7 శాతం పరిమితినీ 15 శాతానికి పెంచాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు పాసైతే దశాబ్దాల తరబడి గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరుగుతుంది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సెనేట్లో గట్టెక్కాల్సి ఉంటుంది.
ఈగల్ యాక్ట్, 2021తో భారత ఐటీ నిపుణులకు లాభమేంటి?