వాషింగ్ టన్ : మే 7; దోమలను అరికట్టడం ద్వారా డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులను నియంత్రించడానికి బిల్ గేట్స్ నిధులతో బయోటెక్ సంస్థ అమెరికాలో 15,0000 జన్యుమార్పిడి దోమలను విడుదల చేసింది. యూకే లోని అబింగ్డన్ కేంద్రంగా ఉన్నఆక్సిటెక్ అనే సంస్థ ఇప్పటికే బ్రెజిల్, మలేషియా, పనామా, కేమాన్ దీవులలో ఈ దోమలను పరీక్షించింది.
అసలు ఏదోమలవలనఈవ్యాధులుఎక్కువగాప్రభలుతున్నాయనేదానిపై పరిశోధకులు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దీనిప్రకారం సంతానోత్పత్తికోసం మగ ఏయిడిస్ ఈజిప్టి జాతి దోమలతో ఆడదోమలు జతకడుతుంటాయి. ఆసమయంలో ఆడ దోమలను చంపడానికి జన్యుపరమైన మగదోమలను తయారుచేసి వాటి పై ప్రయోగించారు. దీంతో ఆడదోమలు చనిపోయాయి. ఈ విధానం ఫలితాలనివ్వడంతో పెద్ద మొత్తంలో ఆడదోమల్ని చంపేసే ప్రక్రియను అనుసరిస్తున్నారు. ఆడ దోమలుచనిపోవడం ద్వారా వ్యాధికారక దోమల సంఖ్య ను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసమే బిల్ గేట్స్ నిధులతో బయోటెక్ సంస్థ అమెరికాలో15,0000 జన్యుమార్పిడి దోమలను విడుదల చేసింది.
మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి చాలా కాలంగా గేట్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నది. 2010 లో గేట్స్ 9 4.9 మిలియన్లను ఆక్సిటెక్కు విరాళంగా ఇచ్చింది. జికా వైరస్ ,ఎల్లోఫీవర్ లకు కారణమైన జన్యుపరంగా మార్పు చెందిన ఈడెస్ ఈజిప్టి దోమను కంపెనీ ఇప్పటికే సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో, వారు ఈడెస్ ఏజిప్టి దోమసంఖ్యను90శాతంతగ్గించారు.మొత్తంమీద, గేట్స్ ఫౌండేషన్ మలేరియాతో పోరాడటానికి మొత్తం బిలియన్ల నిధులను ఇచ్చింది.