న్యూయార్క్, మే 4: మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్గేట్స్, ఆయన భార్య మెలిండా విడాకులు తీసుకోనున్నారు. తమ 27 ఏండ్ల వివాహబంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. ‘ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి కొనసాగితే జీవితపు తరువాతి దశల్లో ఎదగలేమని భావించాం. ఎంతో ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చాం. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. అయితే మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను కలిసే నిర్వహిస్తామని తెలిపారు. కరోనా కట్టడికి, పేద దేశాలకు టీకాల కోసం మెలిండా గేట్స్ ఫౌండేషన్ గతేడాది రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది.
బిల్గేట్స్, మెలిండా విడాకుల ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బిల్గేట్స్కు 65 ఏండ్లు. మెలిండాకు 56 ఏండ్లు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో మెలిండా ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఇద్దరూ 1994లో పెండ్లి చేసుకొన్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2000 సంవత్సరంలో మెలిండా గేట్స్ ఫౌండేషన్ను స్థాపించారు. దాని ఆస్తులు 3 లక్షల కోట్లకు పైనే (43 బిలియన్ డాలర్లకు) పైనే ఉన్నాయి.