ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరత వేధిస్తుండగా మరోవైపు దవాఖానల్లో వరుస ప్రమాదాలతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా థానేలోని ఓ ప్రైవేట్ దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అందులో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు మృతిచెందారు.
థానేలోని ముంబ్రా ప్రాంతంలో ఉన్న ప్రైమ్ క్రిటికేర్ హాస్పిటల్లో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి దవాఖాన అంతా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. రోగులను ఇతర హాస్పిటళ్లకు తరలిస్తుండగా నలుగురు మృతిచెందారని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..