కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల కేసులను పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోల్కతా హైకోర్టు ఈ నెల 18న ఆదేశించింది. అయితే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వం ఒక పిటిషన్ను దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను పరిశీలించి తిరిస్కరించింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింస కారణంగా ప్రజలు తమ నివాసాలను వీడటం, భౌతిక దాడులు, ఆస్తుల నాశనం, వ్యాపార స్థలాలను దోచుకోవడం వంటి ఆరోపణలతో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ పరిశీలనకు ఆదేశించామని కోర్టు పేర్కొంది.