వాషింగ్టన్: గ్వాంటెనమో జైలును తన పదవీకాలం ముగిసే లోపు మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. క్యూబాలోని అమెరికా భూభాగంలో ఉన్న ఆ జైలు… క్రూర నిర్బంధ కేంద్రంగా విమర్శలకు కారణమవుతున్నది. దాన్ని మూసివేయాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జైలులో 40 మంది ఖైదీలు ఉన్నారు.