భూటాన్: హిమాలయ దేశం భూటాన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆ దేశంలో ఉన్న జనాభాలో 60 శాతం మంది టీకా తీసుకున్నారు. కేవలం 9 రోజుల క్రితమే ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 7,70,000 మంది జనాభాలో సుమారు 4,70,000 మంది టీకా వేసుకున్నారు. ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ టీకాలను భారత్ ఆ దేశానికి డోనేట్ చేసింది. 60 శాతం వ్యాక్సినేషన్ మార్క్ను దాటిన దేశాల్లో సీషెల్స్, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. మార్చి 27వ తేదీన భూటాన్లో వ్యాక్సినేషన్ మొదలైంది. ఇప్పటి వరకు 533,000 మంది వయోజనులకు టీకా ఇచ్చారు. 70 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చే అంశంలో దృష్టి పెట్టినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. స్థానిక దివ్యాంగులకు కూడా టీకా ఇవ్వనున్నారు. 896 కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అయ్యాయి. ఇజ్రాయిల్ దేశం ఇప్పటికే తమ జనాభాలో సగం కన్నా ఎక్కువ మందికి రెండు డోసుల టీకా ఇచ్చారు.