జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం
గద్వాల, మే 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. గద్వాల, గట్టు, ధరూర్, మల్దకల్ మండలాల్లో వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో కురిసిన వర్షానికి ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం కొంత మేర తడిసి పోయింది. అధికారులు, రైతులు అప్రమత్తమై ధాన్యంపై పరదాలు కప్పారు. రాజోళి మండలంలో భారీ వర్షం కురువగా.. సుమారు 400 బస్తాల మేర ధాన్యం తడిసింది. అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, శాంతినగర్, ఇటిక్యాల మండలాల్లో కొద్దిపాటి వర్షం కురిసింది.