ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నీలగిరి, మే 6: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు 45సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. గురువారం తన నివాసంలో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆయనకు టీకా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీకాల వల్ల దుష్ఫలితాలు ఉండవన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం అందుతున్నదని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.