అమరావతి,జూన్ 19: దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 నుంచి జులై 1 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 నుంచి 30 వరకు విశాఖపట్నాం-కాచిగూడ (08561), విశాఖపట్నాం-కడప (07488), విశాఖపట్నాం-లింగంపల్లి (02831) రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 22 నుంచి జులై 1 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562), కడప-విశాఖపట్నం (07487), లింగంపల్లి-విశాఖపట్నం (02832) రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే.