న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉండటంతో మరో దేశం భారత ప్రయాణికులపై నిషేధం విధించింది. తమ దేశంలోకి భారత ప్రయాణికుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఈ రోజు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా తదితర దేశాలు భారత ప్రయాణిలకుపై నిషేధం విధించాయి. ఇప్పుడు బహ్రెయిన్ కూడా ఆ జాబితాలో చేరింది.
రెడ్ లిస్ట్లోని దేశాల ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించబోమని బహ్రెయిన్ ప్రకటించింది. రెడ్ లిస్ట్లోని దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటంతో భారత ప్రయాణికులు బహ్రెయిన్లోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. భారత్తోపాటు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలు కూడా రెడ్లిస్ట్లో ఉన్నందువల్ల ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులకు కూడా ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. అయితే బహ్రెయిన్ పౌరులు, రెసిడెన్సీ వీసాదారులకు ఈ ఆదేశాలు వర్తించవని బహ్రెయిన్ స్పష్టం చేసింది.