ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేదనే కోపంతో కేశ్ కుమారి అనే మహిళ తన మూడేండ్ల కొడుకును కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం అదే కత్తితో తనకుతాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతాప్గఢ్ జిల్లాలోని పూరీ బైజ్నాథ్ గ్రామానికి చెందిన కేశ్కుమారి, రాకేశ్ ఇద్దరూ భార్యాభర్తలు. వారికి మూడేండ్ల కొడుకు ఉన్నాడు. అయితే, గత రెండు రోజులుగా హోళి పండుగ కోసం తనను పుట్టింటికి తీసుకెళ్లాలని కేశ్కుమారి భర్తను కోరుతుండగా అతను నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న తమ ఇంట్లోనే భర్త ఒక గదిలో, కేశ్కుమారి తన కుమారుడితో కలిసి మరో గదిలో పడుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున కేశ్కుమారి గది నుంచి గట్టిగా బాలుడి ఏడుపు వినిపించడంతో భర్తతోపాటు ఇరుగుపొరుగు పరుగున అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే బాలుడు విగతజీవిగా రక్తపు మడుగులో పడిఉండగా, కేశ్కుమారి అపస్మారక స్థితిలో కనిపించింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే, గ్రామస్తుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూడ్చేసిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. కాగా, కేశ్ కుమారి స్పృహలోకి వస్తే ఘటనకు సంబంధించిన అన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
తప్పుడు హామీలకు మోసపోవద్దు.. ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !