న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ రూ.100 పెరిగి రూ.48,440కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 తులం 24 క్యారట్ గోల్డ్ రూ.48,340 వద్ద ముగిసింది. అదేవిధంగా హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర కూడా రూ.90 పెరిగి రూ.44,400కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం రూ.44,310 వద్ద ముగిసింది. ఇక వెండి ధర హైదరాబాద్లో రూ.75 వేల వద్ధ స్థిరంగా ఉన్నది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.389 పెరిగి రూ.46,762కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం రూ.46,373 వద్ద ముగిసింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.397 పెరిగి రూ.69,105 వద్ద ముగిసింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,708 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,806 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.63 అమెరికన్ డాలర్లు పలికింది.