(Taslima Nasreen) న్యూఢిల్లీ : బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, హిందువుల భద్రతకు భరోసా కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతిస్పందనగా, హిందువుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి హామీ ఇచ్చింది. ఈ దాడులతో తాలిబన్కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తెల్చిచెప్పింది. గత తొమ్మిదేండ్లలో జరిగిన హింసలో 3,000 కంటే ఎక్కువ మంది హిందువుల ఇండ్లు ధ్వంసమయ్యాయని రైటిస్టు సంస్థలు చెప్తున్నాయి.
కాగా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడాన్ని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఖండిస్తూ పలు ట్వీట్లు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన హింసలో నిరాశ్రయులైన, ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలను కూడా ఆమె ట్వీట్తో జత చేశారు. హిందువులపై దాడి చేయడం పట్ల సిగ్గుపడుతున్నానని తస్లీమా నస్రీన్ రాశారు. ఇండ్లు తగలబడిపోవడం, కూల్చివేయడంతో వందలాది మంది హిందువులు నిరాశ్రయులయ్యారని ఆమె విచారం వ్యక్తం చేశారు. నా దేశం ఏడుస్తున్నదని మరొక ట్వీట్లో రాశారు. హిందీ సినిమాలోని ‘తూ హిందూ బనేగా.. నా ముస్లిం బనేగా..’ పాటను తస్లీమా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లలో హిందువుల దేవతలను ధ్వంసం చేసిన తీరును, కూల్చివేసిన మండపాల ఫొటోలను కూడా తస్లీమా షేర్ చేసింది.
దత్తపీఠం ఆశ్రమానికి ఏపీ సీఎం జగన్
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
వైభవంగా పైడితల్లి అమ్మ సిరమానోత్సవం
ఏపీ అసెంబ్లీకి రిపోర్టర్లు కావలెను.. నోటిఫికేషన్ విడుదల
ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..