హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురిలో ఆదివారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రియల్ ఎస్టేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ గాయపడలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్కు చెందిన వెంకటేశ్ కారు నడుపుతున్నాడు. ఒక్కసారిగా అదుపు కోల్పోవడంతో చైతన్యపురిలోని వాసవీ కాలనీలో గల ప్రధాన రహదారి వెంట ఉన్న రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఆఫీసులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.