సమాచార వ్యాప్తిపై ఆంక్షలు: పిచాయ్
న్యూఢిల్లీ, జూలై 13: ఇంటర్నెట్పై పలు దేశాలు ఆంక్షలు విధించడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు ఇంటర్నెట్పై జరుగుతున్న ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ను అడ్డుకోవడం అంటే వెనక్కి వెళ్లడమేనని చెప్పారు. భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తీసుకువచ్చిన వేళ సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, తనలో భారతీయ ఆత్మ ఉందని పిచాయ్ అన్నారు. ‘నేను అమెరికా పౌరుడిని. కానీ నాలో భారతీయ మూలాలు బలంగా పెనవేసుకొని ఉన్నాయి. భారతీయ ఆత్మ నాలో ఉంది’ అన్నారు.