విశాఖపట్టణం : సకాలంలో ప్రాణ వాయువు అందక ఓ 15 నెలల చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ఈ విషాద ఘటన విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ ఉద్యోగి వీరబాబు కూతురు(15 నెలలు) గత నాలుగైదు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో ఆ చిన్నారికి కరోనా పరీక్షల్లో భాగంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు చేయించారు. ఆ ఫలితం నెగిటివ్గా వచ్చింది.
రెండు రోజుల క్రితం మళ్లీ జ్వరం రావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించి సిటీ స్కాన్ చేశారు. ఈ పరీక్షలో ఆ పాప కరోనా వ్యాధి బారిన పడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి నిన్న తరలించారు. కానీ వైద్యులు ఆస్పత్రిలో సకాలంలో చేర్చుకోలేదు. కనీసం గంటన్నర పాటు వేడుకున్న తర్వాత ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణ వాయువు అందక చిన్నారి ఊపిరి ఆగిపోయింది. వైద్యులు సకాలంలో చేర్చుకుని ఉంటే తమ పాప బతికి ఉండేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవికూడా చదవండి..