బ్రస్సెల్స్: ఆస్ట్రాజెనికా కంపెనీ కష్టాల్లో చిక్కుకున్నది. యురోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ కంపెనీ కోవిడ్ టీకాలను సరఫరా చేయలేకపోయింది. అయితే ఆ కేసులో ఆస్ట్రాజెనికాకు భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. బ్రస్సెల్స్ కోర్టులో ఈయూ, ఆస్ట్రాజెనికా మధ్య న్యాయపోరాటం సాగింది. జడ్జి తీర్పునిస్తూ ఆస్ట్రాజెనికాకు డెడ్లైన్ ఫిక్స్ చేశారు. జూన్లోగా 12 కోట్ల టీకాలను 30 కోట్ల టీకాలను సరఫరా చేసేందుకు ఆస్ట్రాజెనికా అంగీకరించింది. కానీ ఆ కంపెనీ అనుకున్న సమయానికి టీకాలు అందించలేకపోయింది. ఈనెల చివర వరకు 12 కోట్ల డోసులను పంపాలని ఈయూ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ను ఆస్ట్రాజెనికా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బ్రస్సెల్స్ కోర్టులో న్యాయమూర్తి తీర్పునిస్తూ.. సెప్టెంబర్ 27వ తేదీ వరకు 8 కోట్ల డోసులను డెలివరీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ కంపెనీ అలా చేయలేకపోతే, అప్పుడు ప్రతి డోసుపై 12 డాలర్లు(సుమారు రూ.900) జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఆస్ట్రాజెనికా కంపెనీ.. ఇండియాలో సీరం సంస్థతో కలిసి కోవీషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.