హైదరాబాద్ : మారు తాళాలతో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముఠా సభ్యులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోని వారిని రిమాండ్కు తరలించారు. ఏసీపీ రమేశ్, డీఐ పురుషోత్తం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన బి రాజు(43), హజీరా(25), వినయ్గౌడ్ (26) బేగంపేట్కు చెందిన దేవేందర్ సింగ్ (37) వీరంతా చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించి వచ్చే నగదును సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నగరంలోని ఉప్పల్, చాదర్ఘాట్, మహంకాళి పోలీస్స్టేషన్ల పరిధిలో వీరు మారు తాళాలను ఉపయోగించి ద్విచక్ర వాహనాలను దొంగలించారు. సుల్తాన్ బజార్కు చెందిన పున్నమ్చంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు వాహనాల దొంగల కోసం గాలించ సాగారు.
ఈ క్రమంలో గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు మహంకాళి క్రైం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోని నిందితులను రిమాండ్కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..