కోల్కతా: ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ప్రధాని బంగ్లాదేశ్కు వెళ్లి పశ్చిమబెంగాల్ గురించి లెక్చర్లు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్పూర్లో మాట్లాడిన మమతాబెనర్జి.. ఎన్నికల వేళ పొరుగు దేశంలో ప్రధాని మోదీ బెంగాల్ గురించి ప్రసంగాలు చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని విమర్శించారు.
కాగా, ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్కు వెళ్లారు. తొలి రోజైన శుక్రవారం బంగ్లాదేశ్ నేషనల్ డే పోగ్రామ్తోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం సట్ఖరీ జిల్లాలోని జెశోరేశ్వరి కాళీ టెంపుల్ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బెంగాల్ ప్రస్తావన తెచ్చారు. దాంతో ప్రధాని తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.