హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య అనకూల దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేయనున్నారు. అయితే పత్రిక మూసివేత అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఆ పత్రికకు చెందిన సుమారు 2.3 మిలియన్ల డాలర్ల ఆస్తులను ఇటీవల సీజ్ చేశారు. జాతీయ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై యాపిల్ డెయిలీ పత్రికపై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఆ పత్రిక చీఫ్ ఎడిటర్తో పాటు మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్లను ఇటీవల అరెస్టు చేశారు. వ్యవస్థాపకుడు జిమ్మీ లేయి ఇప్పటికే జైలులో ఉన్నారు. చైనా జోక్యాన్ని ప్రశ్నిస్తూ యాపిల్ పత్రిక కథనాలు రాస్తున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం ఆ పత్రికపై కత్తి దూసింది.