ఐస్క్రీమ్, అవకాడోలను ఐఎస్ఎస్కు పంపిన స్పేస్ ఎక్స్ సంస్థ
వాషింగ్టన్, ఆగస్టు 29: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’ రోదసిలోకి చీమలను పంపించింది. అమెరికాలోని జాన్ కెనడీ స్పేస్ రీసర్చ్ సెంటర్ నుంచి ఆదివారం ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్) మరమ్మతులకు అవసరమైన రోబోటిక్ సామగ్రిని తరలించడంతో పాటు అందులోని ఏడుగురు వ్యోమగాములకు ఆహారాన్ని అందించేందుకు పరిశోధకులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆహార పదార్థాల జాబితాలో తాజా పండ్లు, నిమ్మకాయలతో పాటు ఐస్క్రీమ్ కూడా ఉన్నది. అలాగే, అమెరికాకు చెందిన గర్ల్స్ స్కౌట్స్ సంస్థ పంపించిన చీమలు, మొక్కలను కూడా ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి పంపించారు. అంతరిక్షంలో ఆ ప్రాణులు ఏ విధంగా ప్రవర్తిస్తాయన్న అంశంపై ఆ సంస్థ పరిశోధనలు చేస్తున్నది.