లండన్: ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు మధ్య ఎక్కువ వ్యవధితో యాంటిబాడీలు, టీ సెల్ ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా వృద్ధి చెందినట్టు బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సారథ్యంలో నిర్వహించిన ఈ పరిశోధనలో పలు ఇతర వర్సిటీల శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు. రెండు డోసుల మధ్యకాలంలో యాంటిబాడీలు తగ్గినప్పటికీ రెండో డోసు తర్వాత పుంజుకున్నాయని తెలిపారు. టీ సెల్స్ మాత్రం రెండో డోసుల మధ్య నిడివిలో కూడా నిలకడగా ఉన్నాయని గుర్తించారు.