వాషింగ్టన్ : కరోనా వైరస్ సహజంగా అభివృద్ధి చెందిందన్న వాదనతో తాను ఏకీభవించనని మహమ్మారి వ్యాప్తికి దారితీసిన పరిస్థితులకు చైనాలో ఏం జరిగిందనే దానిపై నిగ్గుతేల్చాలనే గొంతుకలకు బాసటగా నిలుస్తానని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌసీ అన్నారు. యునైటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అమెరికా పేరిట ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహమ్మారి వ్యాప్తికి చైనాలో ఏం జరగిందనేది వెల్లడయ్యే వరకూ మన పరిశోధనలు సాగాలని, ఈ వైరస్ సహజంగా అభివృద్ధి చెందిందనే విషయంతో తాను సమ్మతించనని స్పష్టం చేశారు.
జంతువుల నుంచి మానవులకు ఈ వైరస్ సోకిందని పరిశోధకులు చెప్పేందుకు ప్రయత్నించినా దీనికంటే మరేదో మహమ్మారి పుట్టుక, వ్యాప్తి వెనుక ఉండవచ్చని దాన్ని మనం కనుగొనాల్సి ఉందని జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్ పౌసీ అన్నారు. చైనాలో ఏం జరిగిందనేది గుర్తించేందుకు తదుపరి పరిశోధనల పట్ల తాను పూర్తి సానుకూలంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా కొవిడ్-19 తొలిసారి ప్రపంచంపై విరుచుకుపడిన సమయంలో మహమ్మారి పుట్టుక చైనా కేంద్రంగా సాగిందనే వాదనను తోసిపుచ్చిన ఫౌసీ ప్రస్తుతం యూటర్న్ తీసుకోవడం విశేషం. వైరస్ సహజంగా అభివృద్ధి చెంది భిన్న వర్గాలకు వ్యాపించిందని అప్పట్లో ఫౌసీ పేర్కొన్నారు.