సిటీబ్యూరో, మే 31 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లు వ్యాక్సిన్ కోసం తమ పేర్లను సంబంధిత ఆర్టీఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని టోకెన్లు పొందాలని టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్యస్థానంలో చేర్చడంలో కీలకపాత్ర ఆటో డ్రైవర్లదే కావడంతో వారి ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం వారికి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు. జూన్ 3 నుంచి వ్యాక్సినేషన్ షురూ అవుతుందని వెల్లడించారు. సుమారు 2.50 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ ఉండనుందని వివరించారు. ఈ విషయాన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నతాధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు తమ పేర్లను ఆర్టీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారని చెప్పారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.