వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గాన్లో కల్లోలంపై ప్రముఖ నటి ఏంజెలినా జోలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి అఫ్గాన్ ప్రజల పట్ల సానుభూతి ప్రకటించారు. ఓ అఫ్గాన్ బాలిక రాసిన లేఖను పోస్టు చేశారు. అఫ్గాన్ల కష్టాలను ప్రపంచానికి చాటేందుకు తన ఇన్స్టా ఖాతాను అంకితమిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిన అఫ్గాన్లను చూస్తుంటే బాధగా ఉంది. వారికి సాయం చేద్దాం. మీరు కూడా నాతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నా’ అని పిలుపునిచ్చారు. ఆమె ఇన్స్టా ఖాతా తెరిచిన గంటల్లోనే 50 లక్షల మంది ఫాలో అయ్యారు.