జెరూసలేం, జూన్ 28: ఆదిమానవులకు సంబంధించిన కొత్త జాతిని మధ్య ఇజ్రాయెల్లో కనుగొన్నట్టు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. టెల్ అవీవ్లోని ఓ సిమెంట్ ప్లాంట్ కింద 1.30 లక్షల సంవత్సరాలకు చెందిన ఓ పుర్రె, కింది దవడకు సంబంధించిన శిలాజాలను కనుగొన్నట్టు చెప్పారు. నియండర్తల్స్కు దగ్గరి పోలిక కలిగిన ఈ ఆదిమానవుల జాతికి ‘నెషర్ రామ్లా హోమో’ అని పేరు పెట్టినట్టు టెల్ అవీవ్ యూనివర్సిటీ, హెబ్రే యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు తెలిపారు. ‘నెషర్ రామ్లా హోమో’లకు పొడవైన దంతాలు ఉండేవని, దవడ ముందు భాగం ఉండేది కాదని అంచనా వేస్తున్నారు.