నిర్మల్ అర్బన్ :రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్ లను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ఆయన అభిమతమన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి పండుగకి గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం