నారాయణపేట టౌన్, ఏప్రిల్ 18 : ఆత్మరక్షణ కోసం చిన్నారులు, యువత కరాటే నేర్చుకోవాల ని సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అన్నా రు. మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అంతర్జాతీయ ఆన్లైన్ ఈ కటా చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించిన బాలరాజు కరాటే అకాడమీ విద్యార్థులకు ఆ దివారం స్థానిక సిటిజన్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగారు, వెండి పతకాలను అం దజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ఈ కటా చాంపియన్షిప్ పోటీల్లో ఇండియాతోపాటు 25 దేశాల నుంచి 2,700 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక దారుఢ్యం ఏర్పడుతుందన్నా రు. నేటి కాలంలో విద్యార్థినులు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. మొత్తం 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 30 మం ది విద్యార్థులకు వెండి పతకాలు, ప్రశంసా పత్రా లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కాయ్ అ ధ్యక్షుడు మాస్టర్ బాలరాజు, జూనియర్ మాస్టర్లు అస్లాం, సోహెల్, మహేశ్, పాషా, మోహైన్, సం తోష్, రసూల్ పాల్గొన్నారు.
Narayanpet 19-04-2021
శ్యామ్సింగరాయ్ కోసం భారీ సెట్టు..!
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత