పుణె: ఇంగ్లాండ్తో నిర్ణయాక ఆఖరి మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మరోసారి అదరగొట్టారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పంత్(78: 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్ పాండ్య(64: 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో రోహిత్ శర్మ(37), ఆఖర్లో శార్దుల్ ఠాకూర్(30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ మూడు వికెట్లు తీయగా..అదిల్ రసీద్ రెండు వికెట్లతో చెలరేగాడు.
భారత్కు మెరుపు శుభారంభం దక్కింది. రోహిత్-ధావన్ అదరగొడుతూ తొలి వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్, ధావన్, కోహ్లీ(7) ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ ధనాధన్ ఆటతో చెలరేగాడు. 157/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును పంత్, హార్దిక్ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన తర్వాత పంత్ గేర్ మార్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్ జోరుకు 36వ ఓవర్లో శామ్ కరన్ బ్రేక్ వేశాడు.
ఆ తర్వాత హార్దిక్ వేగంగా ఆడి హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్లో హార్దిక్ అవుటైనా అప్పటికే జట్టు పటిష్ఠ స్కోరుకు చేరుకుంది. ఆఖర్లో కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకూర్(30) వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 300 దాటించారు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కృనాల్ ఔటైన తర్వాత టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.