న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని తన మొదటి డోసు తీసుకున్న 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు. హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా.. ‘నేను ఎయిమ్స్లో ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. కరోనా వైరస్పై జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. అర్హులైనవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ కోసం CoWin.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీకి ఇద్దరు నర్సులు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో మొదటి డోసు ఇచ్చిన సిస్టర్ పీ. నివేదిత, నిషా శర్మ ఉన్నారు. నివేదిత పుదుచ్చేరికి చెందినవారుకాగా, నిషా శర్మ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. దేశంలో ఇప్పటివరకు 9 కోట్లకుపైగా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..