న్యూఢిల్లీ, జూన్ 30: గ్రీన్ పాస్పోర్ట్ స్కీమ్ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రయాణ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను తీసుకున్న భారతీయులను కూడా యూరప్లో పర్యటించేందుకు అనుమతించాలని భారత్ కోరింది. కొవిన్ పోర్టల్ ద్వారా జారీచేస్తున్న వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలను అంగీకరించాలని ఈయూని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.