హైదరాబాద్ : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం కలిశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్యే చిన్నయ్య ఆశీస్సులు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని బెల్లంపల్లి పట్టణంలోనే నిర్మించాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే చిన్నయ్య విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలం బెల్లంపల్లి పట్టణంలో ఉందన్నారు. ప్రజా రవాణాకు అనుకూలంగా ఉందన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తే.. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందని తెలిపారు. దీంతో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని సీఎంకు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే చిన్నయ్య చెప్పారు.