వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ శైవక్షేత్రమైన రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను ఈ నెల 22 వరకు రద్దు చేశారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 21న జరగాల్సిన శ్రీరామనవమి రథోత్సవంతోపాటు కల్యాణాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విషయాన్ని గమనించి భక్తులు ఆలయానికి రాకుండా సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి