కాబూల్: తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘన్ వెళ్లడంతో ఆ దేశ తొలి మహిళా మేయర్, అత్యంత పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టిన 27 ఏండ్ల జరిఫా గఫారీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాలిబన్లు తనను చంపేస్తారని భయపడుతున్నారు. ‘నన్ను రక్షించేవాళ్లు ఎవ్వరూ లేరు. నాలాంటి వాళ్లను అంతం చేసేందుకు వాళ్లు (తాలిబన్లు) తప్పకుండా వస్తారు’ అని ఆమె గద్గద స్వరంతో అన్నారు. ఓ మహిళ.. మేయర్గా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేని తాలిబన్లు జరిఫాను చంపేందుకు ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నించారు.