డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హిమపాతం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. మరికొందరు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 38 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వారి ఆచూకీ కోసం ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం, ఇండియన్ ఆర్మీ జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హిమపాతం సంభవించిన సమయంలో ఘటనా ప్రాంతంలో మొత్తం 430 మంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, వారిలో 8 మంది మరణించారని, మరో 384 మందిని రక్షించగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. 430 మందిలో 392 మందిపోగా మరో 38 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వారి కోసం సెర్చింగ్ కొనసాగుతున్నదని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారత్-చైనా సరిహద్దుల్లోగల చమోలీ జిల్లాలోని కొండలపై శుక్రవారం సాయంత్రం భారీగా మంచు కురిసింది. ఆ మంచు ఒక్కసారిగా జారిపోయి ఓ కొండ దిగువన రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులపై పడింది. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో సుమ్నా గ్రామం సమీపంలో ఈ హిమపాతం సంభవించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..