న్యూయార్క్: గెలాక్సీ పవనాలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలి సారి మ్యాపింగ్ చేశారు. దీన్ని ఓ అద్భుత ఆవిష్కరణగా గుర్తిస్తున్నారు. విశ్వంలో అదృశ్యమవుతున్న మ్యాటర్ ఎక్కడకు వెళ్తోందన్న కోణంలో అధ్యయనం చేయడానికి ఈ మ్యాపింగ్ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గెలాక్సీల చుట్టూ ఏర్పడుతున్న నెబులాలను కూడా స్టడీ చేసేందుకు దోహదపడనున్నది. బాహ్య విశ్వం నుంచి నక్షత్రాల్లోకి పదార్థాలు వస్తూ వెళ్తుంటాయి. ఆ మ్యాటర్ మార్పు కూడా చెందుతుంది. అయితే నక్షత్రాల విస్పోటనం వల్ల ఏర్పడే గెలాక్టిక్ విండ్స్తో ఇలా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
యురోపియన్ సదరన్ అబ్జర్వేటరీలో ఉన్న అతిపెద్ద టెలిస్కోప్ మ్యూజ్ ఇన్స్ట్రూమెంట్ ద్వారా మొదటి సారి పాలపుంత పవనాలను పసికట్టారు. ఎంఎన్ఆర్ఏఎస్ జర్నల్లో దీని గురించి ఆసక్తికర కథనాన్ని పబ్లిష్ చేశారు. మ్యూజ్ అంటే మల్టీ యూనిట్ స్పెక్ట్రోస్కోపిక్ ఎక్స్ప్లోరర్. సుదూర విశ్వాన్ని స్టడీ చేసేందుకు దీంట్లో 3డ్రీ స్పెక్టోగ్రాఫ్ డిజైన్ను అమర్చారు. పాలపుంతలు, నక్షత్రమండలాలను అధ్యయనం చేయాలంటే బేరియాన్స్ను స్టడీ చేయాల్సి ఉంటుంది. సాధారణ గెలాక్సీల ఏర్పాటులో బేరియాన్స్ 80 శాతం వరకు ఉంటాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్ల కలిసి ఉన్న మ్యాటర్నే బేరియాన్స్ అంటారు.
విశ్వం నుంచి మిస్సు అవుతున్న బేరియాన్లు..దాంట్లో 90 శాతం వరకు నక్షత్ర సమూహాలను దాటేస్తున్నాయి. దీని ద్వారా గెలాక్సీలు ఎలా ఆవిర్భించాయో అధ్యయనం చేసేందుకు వీలుకానున్నది. మ్యూజ్ పరికరం ద్వారా గెలాక్సీ మ్యాప్లను పరిశోధకులు రూపొందించారు. సీఎన్ఆర్ఎస్ పరిశోధకులతో పాటు క్లాడ్ బెర్నార్డ్ లియాన్ వర్సిటీ కూడా ఈ స్టడీలో పాల్గొన్నది. గెలాక్సీల గాలి ద్వారానే వాయు మేఘాల రూపంలో ఉండే నెబులాలు ఏర్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.