వెంగళరావునగర్, జూన్ 4 : పురిటి నొప్పులతో నడి రోడ్డుపై తల్లడిల్లుతున్న ‘నిండు చూలాలు’కు.. పోలీసులు అండగా నిలిచారు. కర్ఫ్యూవేళ.. రాత్రి సమయంలో దవాఖానకు వెళ్లేందుకు.. రోడ్డుపైకి రాగా.. బస్సులు, ఆటోలు లేకపోవడంతో ఆందోళనకు గురైన భర్త కనుచూపు మేర ఉన్న పోలీస్ అవుట్ పోస్టును సంప్రదించగా.. వెంటనే స్పందించారు. పోలీస్ వాహనంలో గర్భిణిని దవాఖానకు చేర్చగా.. పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపత్కాలంలో అండగా నిలిచిన పోలీసులకు
వివరాల్లోకి వెళితే.. బోరబండ రాజ్నగర్లో నివాసముండే స్క్రాప్ వ్యాపారి ఆనంద్ భార్య స్వాతి నిండు గర్భిణి. గురువారం రాత్రి స్వాతికి పురిటినొప్పులు వచ్చాయి. నిలోఫర్ దవాఖానకు తీసుకువెళ్లేందుకు స్థానిక అంగన్వాడీ టీచర్తో కలిసి బయల్దేరారు. బోరబండ బస్స్టాప్నకు వచ్చేసరికి కర్ఫ్యూ సందర్భంగా బస్సులు, ఆటోలు కనిపించలేవు. అంబులెన్స్లు అందుబాటులోలేవు. ఆందోళనకు గురైన స్వాతి భర్త స్థానికంగా ఉన్న ఎస్ఆర్నగర్ పోలీస్ అవుట్ పోస్టుకు చేరుకున్నాడు.
తన భార్య పురిటినొప్పుతో రోడ్డుపై వేదన పడుతున్నదని, సాయం చేయాలని పోలీసులను కోరాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సాయిప్రసాద్, హోం గార్డు శ్రావణ్ వెంటనే సీఐ సైదులుకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాలతో పోలీస్ వాహనంలో స్వాతిని నిలోఫర్ దవాఖానకు చేర్చారు. దవాఖానలో అడ్మిట్ అయిన స్వాతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని స్వాతి భర్త ఆనంద్ తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పోలీసులను అభినందించారు.