కైరో: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవటం కోసం రబ్బర్ బోటులో వెళ్తున్న 130 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. 130 మందితో గురువారం యూరోప్కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో శనివారం గుర్తించారు.
బోటు దగ్గరకు వెళ్లి చూడగా అందులో ప్రయాణికులు లేరు. కానీ, ఆ బోటు చుట్టూ పదికిపైగా శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. దాంతో వారంతా మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి వలసదారుల సంక్షేమ విభాగం వెల్లడించింది. అదేవిధంగా ట్రిపోలికి తూర్పున మరో రెండు రబ్బర్ పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
పేదరికం, అంతర్యుద్ధం కారణంగా ఆఫ్రికాలో బతుకడం దుర్బరంగా మారుతుండటంతో చాలామంది మెరుగైన జీవితం కోసం మధ్యధరా సముద్రం గుండా యూరప్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ఇందుకోసం రబ్బరు బోట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే బోట్ల నిర్వాహకులు వాటిలో పరిమితికి మించి వలసదారులను తీసుకెళ్తుంటారు. అందువల్లే 130 మందితో బయలుదేరిన రబ్బర్ బోటు మునిగిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..