ఐరాస, మార్చి 5: ‘అన్నమో రామచంద్రా’ అని అలమటిస్తూ ఏటా లక్షలాది మంది ఆకలికి ప్రాణాలు వదులుతుంటే.. మరోవైపు టన్నుల కొద్దీ ఆహారం వృథా అయిపోతున్న విచిత్ర పరిస్థితి మన సమాజానిది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 93.1 కోట్ల టన్నుల ఆహారం వృథాగా పోయిందని ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021’ పేరిట ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ఈపీ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో ఇండ్లల్లో వృథా అయిన ఆహారమే 61 శాతంగా ఉన్నదని నివేదిక తేల్చింది. 2019లో వృథా అయిన ఆహారాన్ని 40 టన్నుల చొప్పున సామర్థ్యం కలిగిన దాదాపు 2.3 కోట్ల లారీల్లో నింపవచ్చని పేర్కొన్నది. 2019లో భారత్లో 6.87 కోట్ల టన్నుల ఆహారం వృథా అయినట్టు తెలిపింది.
2019లో ఇండ్లల్లో ఒక్కో వ్యక్తి వృథా చేసిన ఆహారం
భారత్ 50 కిలోలు
అమెరికా 59 కిలోలు
చైనా 64 కిలోలు